యాప్నగరం

ఒంటరి బావమరిదిపై బావ కన్ను.. మందుపార్టీకి తీసుకెళ్లి..

బావమరిదికి వారసత్వంగా ఆస్తి కలిసొచ్చింది. అతనికి భార్య, పిల్లలు లేరు. ఆ ఒక్కడిని అడ్డుతప్పిస్తే ఆస్తి తనదవుతుందని బావ అత్యాశకు పోయాడు. చివరికి..

Samayam Telugu 24 Nov 2020, 8:07 pm
భార్యాబిడ్డలు లేకపోవడమే బావమరిదికి శాపంగా మారింది. ఒంటరి బావమరిదిపై బావ కన్ను పడింది. అతని ఆస్తి కాజేయాలని అత్యాశతో దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి కాల్వలో పడేశాడు. కొడుకు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయడంతో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అత్యంత అమానుష ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
liquor


పెడనకి చెందిన మహంతి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం బలరామునిపేటకి చెందిన వీరబాబు(37) బావాబావమరుదులు. వీరబాబుకి భార్యాపిల్లలు లేరు. తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి కలసివచ్చింది. భార్యాబిడ్డలు లేని బావమరిదికి ఆస్తి రావడంతో బావలో అత్యాశ మొదలైంది. ఒంటరి అయిన బావమరిదిని అంతమొందిస్తే ఆస్తి కాజేయొచ్చని పథకం వేశాడు. నమ్మకంగా బావమరిది వీరబాబుకి ఫోన్ చేసి మందు పార్టీ చేసుకుందామని ఆహ్వానించాడు.

బావ పిలిచాడని వీరబాబు ఈ నెల 20న పెడన వచ్చాడు. మద్యం తాగుదామంటూ వీరబాబుని ఇసుకపర్ర డ్రైన్ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. తన బంధువు గంగాధరరావుతో కలసి బావమరిది వీరబాబు మెడకు ఉరి బిగించి దారుణంగా చంపేశాడు. అనంతరం శవాన్ని అక్కడే డ్రైన్‌లో పడేసి వెళ్లిపోయారు. రెండురోజులైనా తన కొడుకు రాలేదని కంగారుపడిన వీరబాబు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొడుకు కనపడడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి తమ స్టైల్లో విచారించడంతో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. డ్రైన్‌లో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం కోసం తరలించారు.

Also Read: కొడుకు పెళ్లి ఫొటోలు చూసి.. తల్లికి రెండో పెళ్లి.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.