యాప్నగరం

చిత్తూరు: అవయవాల అమ్మకానికి సిద్ధమైన యువకుడు.. కారణం తెలిసి అధికారులు షాక్

తన అవయవాలను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మదనపల్లి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన యువకుడు. కారణం తెలిసి షాక్ తిన్న సబ్ కలెక్టర్.. అతడి సమస్యలపై ఆరా.

Samayam Telugu 28 Oct 2019, 8:15 pm
చెల్లెలి పెళ్లి చేసేందుకు అవయవాలను అమ్మకానికి పెట్టాడో అన్న. తన అవయవాలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చాడు. ఆ యువకుడి నిర్ణయం తెలిసి షాక్ తిన్న అధికారులు.. ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. అతడి సమస్యల్ని అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.
Samayam Telugu ctr.


జిల్లాలోని కురబలకోటకు చెందిన యువకుడు బావజాన్‌కు చెల్లెలు ఉంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. కానీ ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత వారం స్పందన కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్‌ను కలిసి తన సమస్యను చెప్పుకొన్నాడు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

చెల్లెలి పెళ్లి చేసేందుకు తన అవయవాల విక్రయానికి సిద్ధపడ్డాడు. తన అవయవాలను అమ్ముకోవడానికి అనుమతి కావాలంటూ మదనపల్లి సబ్ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చాడు. అతడు చెప్పిన కారణం తెలిసి షాక్ తిన్న అధికారులు.. ఏం జరిగిందో తెలుసుకున్నారు. యువకుడు తన పరిస్థితిని వివరించగా.. స్పందించిన సబ్ కలెక్టర్ కీర్తి.. బాధితుడి సమస్యలపై ఆరా తీస్తున్నారు. బావ్‌‌జాన్ సమస్యలపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.