విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. సోమవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి.. నడి రోడ్డుపై మంటల్లో కాలిపోయాడు. అతడ్ని గమనించి స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పటికే చనిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. స్పాట్కు చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తిపై ఎవరైనా పెట్రోల్ పోసి నిప్పంటించారా.. లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
విశాఖలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం
సోమవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి.. నడి రోడ్డుపై మంటల్లో కాలిపోయాడు. అతడ్ని గమనించి స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పటికే చనిపోయాడు.
Samayam Telugu 21 Sep 2020, 8:25 am