యాప్నగరం

కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం.. వైసీపీ ఎమ్మెల్యే రజినికి హెచ్చరిక

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన కారును రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపణ. ఆరు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన. డిసెంబర్ 15లోపు న్యాయం చేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక.

Samayam Telugu 9 Dec 2019, 7:55 am
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినిపై ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకు మంజూరు చేసిన కారును రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులకు చెప్పి.. గత ఆరు నెలలుగా కారు తనకు దక్కకుండా చేశారని ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Samayam Telugu rajini.


చిలకలూరి పేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన శామ్యూల్.. తన వీడియోలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. తాను టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారు మంజూరుచ ేశారని.. జులై 8న అందరికీ కార్లు ఇచ్చారని.. తనకు మాత్రం అధికారులు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి తనకు కారు ఆపాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని.. అందుకే తనకు కారు ఇవ్వలదేన్నాడు.
గత ఆరు నెలలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఉపాధి లేకపోవడంతో తన భార్య, ఇద్దరు కూతుళ్లను అత్తింట్లో వదిలిపెట్టి రావాల్సి వచ్చిందన్నాడు. తనకు కారును డిసెంబర్ 15 లోపు మంజూరు చేయకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబంతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామన్నాడు. విడదల రజినీ వెంటనే తన సమస్యపై స్పందించి పరిష్కరించాలని కోరాడు. మరి ఈ వీడియోపూ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.