యాప్నగరం

విశాఖ: కరోనా పాజిటివ్ వ్యక్తి ఆత్మహత్య.. రెండు రోజుల తర్వాత ట్విస్ట్

ఈ నెల 11న నాలుగు అంతస్థుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందస్తు జాగ్రత్తగా అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా శ్రీనుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ అని తెలిసినందునే శ్రీను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 14 Jul 2020, 2:18 pm
విశాఖ విషాద ఘటన జరిగింది. నగరంలోని శాంతి నగర్‌కు చెందిన భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తి భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ముందస్తు జాగ్రత్తగా అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడికి ముందే పాజిటివ్ అని తెలిసినందునే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీను మరణం తర్వాత కరోనా అని తేలడంతో శాంతినగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు కూడా భయపడిపోతున్నారు.
Samayam Telugu కరోనా పాజిటివ్ రోగి సూసైడ్


మరోవైపు విశాఖ జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం జిల్లావ్యాప్తంగా 84 కేసులు నమోదుకాగా.. మొత్తం 1461 తేలాయి. వీరిలో 852మంది డిశ్చార్జ్ కాగా.. మరో 593మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లావాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.