యాప్నగరం

నా రాజకీయ జీవితం నాశనమైనా.. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మూడు రాజధానుల నిర్ణయంతో తన రాజకీయ భవిష్యత్ నాశనమవుతున్నా.. జగన్ వెంట నడుస్తానన్న ఆర్కే.

Samayam Telugu 20 Jan 2020, 3:53 pm
ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో రైతు వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. దళితుల్ని మోసం చేసి.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో అవినీతికి పాల్పపడ్డారని ఆరోపించారు.
Samayam Telugu alla


Read Also: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సీన్.. జగన్‌ పక్కన కూర్చున్న జనసేన ఎమ్మెల్యే

మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ.. తాను చాలా గొప్ప పనిచేశాను.. ఇక్కడి నుంచి రాజధాని వెళ్లిపోతుందన్న బాధ ఉందని చెప్పుకొచ్చారు. రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేయకముందే.. గత నెల రోజులుగా అనేక మందిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. సాక్షూత్తూ ముఖ్యమంత్రి జగన్‌ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎంత దారుణంగా ప్రవరిస్తున్నారో అందరూ గమనించారన్నారు.

అధికార వికేంద్రీకరణకు మంగళగిరి శాసనసభ్యుడిని అయిన తాను.. రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా పట్టించుకోను అన్నారు ఆర్కే. తాను కచ్చితంగా జగన్ వెంట నడుస్తానని చెప్పారు.. రాజకీయాల్లో ఉంటే మాత్రం 'ఇన్ జగన్ ఉయ్ ట్రస్ట్' అంటూ ఓ ప్లకార్డును అసెంబ్లీలో ప్రదర్శించారు. ఒకవేళ తాను రాజకీయాల్లో లేకపోతే నేను నా చేలో కనిపిస్తానని గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.