యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యేనా మజాకా! నాలుగే రోజుల్లో దొంగ అరెస్టు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చోరీ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి శభాష్ అనిపించుకున్నారు.

Samayam Telugu 22 Nov 2019, 10:02 pm
గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీస్‌లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నాలుగు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి సొమ్ము రికవరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. మంగళగిరి పట్టణం ఆటో నగర్‌లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈ నెల 18 వ తేదీన రూ. 10 లక్షలు చోరీకి గురయ్యాయి. ఆఫీస్‌లో ఎంతవెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu rk mgl


గత కొద్దికాలంగా అదే ఆఫీస్‌లో పని చేస్తున్న ఉండవల్లికి చెందిన తక్కెళ్లపాటి తిరుపతి రెడ్డి అనే యువకుడిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆల్ఫా హోటల్ వద్ద ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 5,19,000/- రూపాయల నగదు, మూడు బంగారు ఉంగరాలు, బంగారు కడియం, ఒక ఫోన్, ఒక కెమెరా, ఒక ట్యాబ్‌ సీజ్ చేశారు.

Also Read: ఏపీలో బార్లు బంద్.. జగన్ సర్కార్ షాకింగ్ నిర్ణయం

ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఉంచిన రూ.10 లక్షల డబ్బు కనిపించకపోవడంతో సిబ్బంది కంగారుపడ్డారు. కార్యాలయంలో సొమ్ము కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు భావించి పోలీసులకు సమాచారమిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేత జూపూడి జాన్సన్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.10లక్షలు ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.