యాప్నగరం

YSRCP ఎంపీ, ఎమ్మెల్యే ఇంట విషాదం

ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Samayam Telugu 3 Sep 2020, 6:49 pm
గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం. ఆయన తండ్రి గురువారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆళ్ల దశరథరామిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇంట విషాదం


దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు కాగా.. మరో కుమారుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి గతంలో నర్సరావుపేట నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్యసభకు అధినేత జగన్ అవకాశం కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.