యాప్నగరం

డియర్ పవన్ కళ్యాణ్.. మీ నుంచి కోరుకునేది అదొక్కటే: సంచయిత కౌంటర్

తన తల్లి ఉమా గజపతి రాజు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమేష్ శర్మను రెండో వివాహం చేసుకున్నారని ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన ఫిల్మ్ మేకర్‌గా ఆరుసార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు.

Samayam Telugu 11 Sep 2020, 8:13 am
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయిత గజపతి రాజు తనను టార్గెట్ చేసిన వారికి వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్నా పాత్రుడిపై ట్విట్టర్‌లో విరుచుకుపడ్డ ఆమె.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేనాని ఆరోపణలకు ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పారు.
Samayam Telugu సంచయిత


మాన్సాస్ ట్రస్ట్ హిందూయేతరుల సారథ్యంలో నడుస్తోందని పవన్ చేసిన వ్యాఖ్యల్ని సంచయిత ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. తాను హిందువునని.. తన తల్లిదండ్రులు ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు హిందువులన్నారు. అయితే తన తల్లి ఉమా గజపతి రాజు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమేష్ శర్మను రెండో వివాహం చేసుకున్నారని ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన ఫిల్మ్ మేకర్‌గా ఆరుసార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు.. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణల ఉచ్చులో పడొద్దన్నారు.
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టులో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని.. అందుకే తమ అవినీతి, అవకతవకలు బయటపడతాయని టీడీపీ నేతలు భయపడుతున్నారని సంచయిత అన్నారు. ఓ హిందువుగా తాను అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తానని.. 'మీరు అలా చేయగలరా' అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ చెబుతున్న అబద్దాలను నమ్మొద్దని.. గతంలో చేసిన వ్యాఖ్యల్ని సరిచేసుకుంటూ ప్రకటన విడుదల చేయాలని పవన్‌ను కోరారు. 'ఓ జెంటిల్‌మెన్‌గా మీ నుంచి నేను ఆశిస్తున్నది అదొక్కటే' అన్నారు సంచయిత. దీనిపై జనసేన అధినేత స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.