వాళ్లతో అశోక్ గజపతిరాజు కుట్ర, ఆ లేఖను ట్వీట్ చేసిన సంచయిత.. తెలుగు తమ్ముళ్ల ట్విస్ట్
రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్గజపతిరాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం అంటూ సంచయిత ట్వీట్.
Samayam Telugu 18 Jan 2021, 11:46 am
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజు అశోక్గజపతి రాజుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్పై ఘాటుగా స్పందించారు. ‘పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు గారితో పాటు అశోక్గజపతిరాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది’ అంటూ ఆనాటి లేఖను ట్వీట్ చేశారు.
‘రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్గజపతిరాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’అన్నారు.
సంచయిత ట్వీట్కు టీడీపీ కార్యకర్తలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పదవి కోసం సొంత బాబాయిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. సంచయిత తన తండ్రి చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు పదవుల కోసం వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
‘రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్గజపతిరాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’అన్నారు.