యాప్నగరం

పెళ్లి చేసుకుని భర్తతో ఇంటికి.. మరో భార్య ఉండడంతో.. చివరికి..

అత్తారింటికి వెళ్లిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆయనకి మరో భార్య ఉందని తెలియడంతో షాక్‌కి గురైంది. తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. విశాఖ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 1 Dec 2020, 1:04 pm
కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన ఆమెకి ఊహించని షాక్ ఎదురైంది. ఆయనకి మరో భార్య ఉందని తెలియడంతో గుండెబద్దలైంది. పెళ్లయిన విషయం చెప్పకుండా మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనోవేదనకు గురైంది. మోసపోయానన్న బాధతో అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
cheating


చింతపల్లి మండల కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన సాయిలక్ష్మి(23)కి గూడెంకొత్తవీధి మండలం పెదవలస గ్రామానికి చెందిన బండి గణేష్‌తో వివాహమైంది. వివాహానంతరం అత్తారింట్లో అడుగుపెట్టిన సాయిలక్ష్మికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆయనకి గతంలోనే మరొకరితో వివాహమైందని తెలియడంతో షాక్‌కి గురైంది. అదే విషయమై భర్తని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

Also Read: తండ్రి మరణం తట్టుకోలేని కూతుళ్లు.. ఫ్యామిలీ ఫొటో దగ్గర లేఖ..

పెళ్లైన విషయం దాచి మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని సాయిలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది. తరచూ గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకుంది. తన అన్నకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పింది. మరుసటి రోజు అంతర్ల సమీపంలోని ఆలయం వెనుక విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: బిరియానీ కోసం ఉద్యోగి కక్కుర్తి.! అనంతపురంలో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.