యుద్ధ రంగంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు ఉక్రెయిన్ దేశం నుంచి తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ చాంబర్లో సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని సీఎం జగన్కు విద్యార్థులు వివరించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
అలాగే, ఉక్రెయిన్లో విద్యార్థులు చిక్కుకున్న సమయంలో తీసుకున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను స్పష్టమైన ఆదేశించినట్లు తెలిపారు. తన ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగి, విద్యార్థులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు.
విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అధికారులు తనకు నివేదించారని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థులు రాష్ట్రానికి చెందిన వారని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని సీఎం జగన్ తెలిపారు. దీన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారని చెప్పారు.
విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్థంగా వ్యవహరించిన అధికారులను సీఎం జగన్ అభినందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం జగన్ అదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. తర్వాత విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడారు. విద్యార్థుల చదువులు గురించి ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తి చేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
అలాగే, ఉక్రెయిన్లో విద్యార్థులు చిక్కుకున్న సమయంలో తీసుకున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను స్పష్టమైన ఆదేశించినట్లు తెలిపారు. తన ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగి, విద్యార్థులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు.
విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అధికారులు తనకు నివేదించారని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థులు రాష్ట్రానికి చెందిన వారని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని సీఎం జగన్ తెలిపారు. దీన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారని చెప్పారు.
విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్థంగా వ్యవహరించిన అధికారులను సీఎం జగన్ అభినందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం జగన్ అదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. తర్వాత విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడారు. విద్యార్థుల చదువులు గురించి ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తి చేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.