యాప్నగరం

YS Jagan: పచ్చ శాలువా కప్పిన చిరంజీవి.. జగన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టీడీపీ

Sye Raa హిట్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న చిరంజీవి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్న పసుపు రంగు శాలువాను జగన్‌కు కప్పారు. దీనిపై టీడీపీ ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు దిగింది.

Samayam Telugu 15 Oct 2019, 3:35 pm
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి సోమవారం భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయల్దేరిన చిరంజీవి దంపతులు విజయవాడ చేరగానే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక.. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. జగన్-భారతి దంపతులు.. చిరంజీవి-సురేఖ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. చిరంజీవికి బొబ్బిలి వీణను జగన్ బహుకరించారు. జగన్, చిరంజీవి భేటీ రాజకీయ, సిని వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Samayam Telugu chiranjeevi jagan.


సైరా చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారని.. సైరా మూవీ చూడాలని సీఎంను కోరారని వార్తలొచ్చాయి. అదనపు షోలు వేయడానికి అనుమతి ఇచ్చినందుకు ఆయన జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని సమాచారం. సైరా మూవీకి వినోద పన్ను రాయితీ కల్పించాలని జగన్‌ను చిరంజీవి కోరినట్టు వార్తలొచ్చాయి.
జగన్, చిరంజీవి భేటీలో ఆసక్తికరమైన అంశం సీఎంకు మెగాస్టార్ పసుపు రంగు శాలువా కప్పడం. ఏపీలో ‘పచ్చ రంగు’ ప్రాధాన్యం ఏంటో అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీ ఈ రంగును ఓన్ చేసుకుంది. చంద్రబాబు ఎవరికైనా పసుపు రంగు శాలువా కప్పేవారు. ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం (ఇప్పుడు మాజీ) కుమారస్వామి తదితరులకు ఆయన పసుపు రంగు శాలువానే కప్పారు. టీడీపీ మీద కోపం కారణంగా.. జగన్‌కు ఈ రంగు అంటే నచ్చదనే భావం ఉంది.
కానీ జగన్‌కు చిరంజీవి పసుపు రంగు శాలువాను కప్పి సత్కరించడం పట్ల సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. జగన్‌ను టీడీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కానీ గతంలో మహానటి సక్సెస్ తర్వాత హీరోయిన్ కీర్తి సురేశ్‌కు కూడా చిరంజీవి పసుపు రంగు శాలువా కప్పి సత్కరించారు.
టీడీపీ ఫ్యాన్స్ చిరంజీవిని కూడా వదలకుండా ట్రోల్ చేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల గురించి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు సర్కారును డిమాండ్ చేసిన చిరంజీవి.. కాపులకు రిజర్వేషన్లు లేకుండా చేసిన జగన్‌తో భేటీ కావడం ఏంటని మండిపడుతున్నారు.
చిరంజీవి హైదరాబాద్‌లో బయల్దేరినప్పుడు పింక్ కలర్ షర్ట్ వేసుకోగా.. అమరావతిలో జగన్‌ను కలిసిన సమయంలో బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు. దీంతో ఆయన కావాలనే బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారని కొందరు ట్రోల్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.