యాప్నగరం

సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీ.. ఎప్పుడంటే!

Sye Raa Movie| అమరావతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్. ఏపీ సీఎంతో అపాయింట్‌మెంట్ ఖరారు చేసిన సీఎంవో. శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ.

Samayam Telugu 10 Oct 2019, 4:13 pm
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎంతో చిరంజీవి, రామ్‌చరణ్‌లు సమావేశంకానున్నారు. కొద్దిరోజుల క్రితం చిరు సీఎం జగన్ అపాయిట్‌మెంట్ కోరారట.. ఈ మేరకు సీఎంవో గురువారం అపాయింట్‌మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జగన్‌తో సైరా సినిమా గురించి చర్చించనున్న మెగాస్టార్.. సినిమా చూడాలని సీఎంను కోరబోతున్నారట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్‌తో చిరంజీవి తొలిసారిగా సమావేశంకాబోతున్నారు.
Samayam Telugu chiru


Read Also: సీఎం జగన్ పర్యటన.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వివాదం!

మెగాస్టార్ జగన్‌ను కలవడం వెనుక చాలా కారణాలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు చిరంజీవి కలవ లేదు. అందుకే జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలపడంతో పాటూ సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపేందుకే అమరావతి వెళ్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను చిరంజీవి కలిశారు. సైరా సినిమా చూడాలని కోరారు.. ఆమె కూడా కుటుంబంతో కలిసి మూవీని వీక్షించారు. అలాగే జగన్‌ను కూడా సినిమా చూడాలని చిరంజీవి ఆహ్వానించనున్నారు.

స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా.తన నటనతో ఆకట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.