యాప్నగరం

జగన్ చెప్పినట్లుగానే.. పోలవరం పనులకు శ్రీకారం

పోలవరం ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టిన మెగా ఇంజినీరింగ్ కంపెనీ. ప్రాజెక్ట్ దగ్గర భూమిపూజ నిర్వహించిన సంస్థ మేనేజర్. నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని గతంలోనే చెప్పిన ఏపీ ప్రభుత్వం.

Samayam Telugu 1 Nov 2019, 2:05 pm
జగన్ సర్కార్ చెప్పినట్లే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న మెగా సంస్థ శుక్రవారం.. స్పిల్‌వే వెనుక భాగంలో భూమిపూజ నిర్వహించారు.. అనంతరం పనులను ప్రారంభించారు. భూమిపూజ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. మెగా సంస్థకు సంబంధించిన యంత్ర సామాగ్రి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి.
Samayam Telugu Polavaram


ఇటు పనుల ప్రారంభంపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పందించారు. చెప్పిన మాట ప్రకారమే.. పనులు ప్రారంభమవుతున్నాయన్నారు.. అనుకున్న సమయానికి పోలవరం పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మంత్రి.. పోలవరం పనులు ఆగిపోతాయని ప్రతిపక్ష పార్టీలు కలలు కన్నాయని.. కోర్టు తీర్పుతో వారి విమర్శకుల చెక్ పడిందన్నారు.

చంద్రబాబు 70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశామని పచ్చి అబద్దాలు మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. 2018 కల్లా పోలవరంను పూర్తి చేస్తామని అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా సవాల్ చేశారని.. మాట తప్పడం అనేది వాళ్లకు అలవాటేనని ఎద్దేవా చేశారు. మాట తప్పకకపోవడం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలవాటుగా వ్యాఖ్యానించారు.

పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌పై నవయుగ సంస్థ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్టేను హైకోర్టు గురువారం ఎత్తేసింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి.. దీంతో కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న మెగా సంస్థ పనులు ప్రారంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.