యాప్నగరం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి గొప్ప మనసు.. ఏపీ రైతులకు భారీ సాయం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య అనుపమ రైతులు, రైతు కూలీల కోసం రూ. 2 కోట్లు సాయం చేశారు.

Samayam Telugu 13 Sep 2020, 7:13 pm
దిగ్గజ మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, రైతు కూలీలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం యాక్షన్‌ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు.
Samayam Telugu సత్య నాదెళ్ల, ఆయన భార్య అనుపమ


Must Read: ఏపీ ఓ దేశమైతే కరోనా కేసుల్లో ప్రపంచంలోనే టాప్ 10లోకి.. 5 వేలకు చేరువలో మరణాలు

అనుపమ ఇచ్చిన ఆర్థిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి తెలిపారు. కాగా, అనుపమ తండ్రి వేణుగోపాల్‌ ఐఏఎస్‌ అధికారి. పలు ప్రాంతాల్లో ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా దేశమంతా పర్యటించారు.

ఆ సమయంలో అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు కూడా ఆమెకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సమస్యలను తెలుసుకున్న అనుపమ తన వంతు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Also Read: ఏపీలో పాస్టర్లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ‘సనాతన సేన’ ఏర్పాటు

Don't Miss: ఇరకాటంలో బీజేపీ.. ప్రత్యేక హోదాపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.