యాప్నగరం

శ్రీహరికోట: షార్ వద్ద వేలాది మంది ఆందోళన.. 40 రోజులుగా తిండిలేక..

శ్రీహరికోట షార్ వద్ద వేలాది మంది వలస కూలీలు ఆందోళన బాటపట్టారు. 40 రోజులుగా తినడానికి తిండి లేదని, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Samayam Telugu 6 May 2020, 5:22 pm
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద వేలాది మంది వలస కూలీలు ఆందోళన బాటపట్టారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు సంబంధించిన షార్‌లో వేలాది మంది వలస కూలీలు పని చేస్తున్నారు. షార్‌లోని పలు విభాగాల్లో కాంట్రాక్టులు పొందిన టాటా, షాపూర్జీ అండ్ పొలంజి, ఎన్‌సీపీ కంపెనీలకు చెందిన యాజమాన్యాలు సుమారు 2000 వేల మంది భవన నిర్మాణ కార్మికులను జార్ఖండ్ రాష్ట్రం నుంచి షార్‌కు తీసుకొచ్చారు.
Samayam Telugu వలస కూలీల ఆందోళన


ఈ నేపథ్యంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వారంతా షార్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో 40 రోజులుగా ఈ 2,000 వేల మంది ఆకలితో అలమటిస్తున్నారు. తాము ఆకలితో అల్లాడిపోతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని కూలీలు ఆందోళన బాటపట్టారు.

ఇప్పటికైనా తమను ఎవరైనా ఆదుకుని ఆకలి తీర్చాలని వేలాది మంది షార్‌ వద్ద ఆందోళన చేపట్టారు. పట్టించుకోని షార్ యాజమాన్యం వారుగాని, కాంట్రాక్టర్లు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.