యాప్నగరం

ప్రకాశం: ఒంగోలులో కంపించిన భూమి.. భయంతో జనం పరుగులు

. కొన్ని సెకన్ల పాటూ స్వల్ప ప్రకంపనలు రావడంతో జనాలు భయంతో వణికిపోయారు.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం ఏపీతో పాటు కర్ణాటక, జార్ఖండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి.

Samayam Telugu 5 Jun 2020, 10:59 am
ప్రకాశం జిల్లా ఒంగోలును భూ ప్రకంపనలు భయపెట్టాయి. నగరంలో శుక్రవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది.. కొన్ని సెకన్ల పాటూ స్వల్ప ప్రకంపనలు రావడంతో జనాలు భయంతో వణికిపోయారు.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శర్మ కాలేజ్, అంబేద్కర్ భవన్, గద్దలగుంట, మామిడిపాలెం, దేవుడి చెరువు ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. తర్వాత భూ ప్రకంపనలు ఆగిపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu ఒంగోలు భూ ప్రకంపనలు


ఒంగోలు సంగతి అలా ఉంటే. శుక్రవారం ఉదయం ఏపీతో పాటు కర్ణాటక, జార్ఖండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 6.55 గంటల సమయంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవత్ర 4గా నమోదైంది. అక్కడా జనాలు భయంతో ఇళ్లలో నుంి బయటకు పరుగులు తీశారు. ఈ భూ ప్రకంకపనలకు కారణాలు తెలియరాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.