తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఓ మ్యానిపులేటర్ అని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్తున్నారని.. కానీ, మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ఆస్తులను పెంచుకోవడం, కొడుకును పునర్ నిర్మిస్తారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమీ ఒరగదని ఎద్దేవా చేశారు. మరోసారి చంద్రబాబు అధికారం కట్టబెడితే.. పోలవరాన్ని చేసినట్లే రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముల వారి ఆలయంలో గురువారం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి అంబటి అన్నారు. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్ట అని అభివర్ణించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు.
పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత టీడీపీ ప్రభుత్వం భాధ్యత వహించాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలు వచ్చాయని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయని.. ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగిందన్నారు.
ఇక, జనసేన పార్టీ అధినేత చంద్రబాబు కోసమే.. పవన్ కళ్యాణ్ పుట్టారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పుట్టారు.. పనిచేస్తున్నారు.. చేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ను దేవుడే రక్షించాలని కోరుకుంటున్నట్లు సెటైర్లు వేశారు. అలాగే, ఓటు చీలకుండా చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి అంబటి అన్నారు. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్ట అని అభివర్ణించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు.
పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత టీడీపీ ప్రభుత్వం భాధ్యత వహించాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలు వచ్చాయని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయని.. ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగిందన్నారు.
ఇక, జనసేన పార్టీ అధినేత చంద్రబాబు కోసమే.. పవన్ కళ్యాణ్ పుట్టారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పుట్టారు.. పనిచేస్తున్నారు.. చేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ను దేవుడే రక్షించాలని కోరుకుంటున్నట్లు సెటైర్లు వేశారు. అలాగే, ఓటు చీలకుండా చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు.