యాప్నగరం

‘చీప్ పీపుల్’ అని మంత్రి అనిల్ అన్నారు.. గుండెలు పిండేసిన ప్రీతి తల్లి ప్రసంగం

‘యూ చీప్ పీపుల్’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి అన్నారు. కర్నూలులో పవన్ కళ్యాణ్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు

Samayam Telugu 12 Feb 2020, 5:13 pm
తన కుమార్తె సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇటీవల మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కలిస్తే.. ఇది తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని చెప్పారని తెలిపారు. ఒకానొక సమయంలో ‘యూ చీప్ పీపుల్’ అని అన్నారని వాపోయారు. సుగాలి ప్రతికి న్యాయం చేయాలంటూ కర్నూలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు.
Samayam Telugu pawan


‘దిశ’ ఘటన కంటే మందే తన కుమార్తె దారుణంగా హత్యాచారానికి గురైందని, కానీ ఎవరూ న్యాయం మాత్రం చేయలేదని పార్వతీదేవి చెప్పారు. ఈ ప్రభుత్వాల్లో డబ్బున్న వారికి ఒక న్యాయం, మాలాంటి పేద వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రాజకీయ నేతలు పేదలకు తియ్యటి మాటలు చెబుతారని, కానీ వాస్తవంలో మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

Also Read: పవన్ కళ్యాణ్‌ గో బ్యాక్.. కర్నూలులో ఉద్రిక్తతతాను ఎన్నో సార్లు వ్యయ ప్రయాసలకోర్చి అమరావతికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదని, ఒక రోజైతే రాత్రి జైలులో కూడా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డ మంచి చదువులు చదివి గొప్ప పేరు తెచ్చుకుంటుందని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో చేర్పిస్తే చివరకు ఇలా బ్యానర్లపై కనిపిస్తుందని అనుకోలేదని రోదించారు. తమకు న్యాయం చేయాలని ముందుకొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.