యాప్నగరం

బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం.. వైసీపీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్తుంది: మంత్రి సురేష్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలతో వైసీపీ ఎప్పుడైనా ఎన్నికలకు పోతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 7 May 2022, 1:24 pm
తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం బయట పడిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనతో.. అందరూ కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తే తప్ప వైసీపీపై గెలవలేమని ఒప్పుకున్నట్లయిందని ఎద్దేవా చేశారు.
Samayam Telugu మంత్రి ఆదిమూలపు సురేష్


ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ విషయమై ఎన్నో సార్లు చర్చలకు రావాలని పిలిచినా టీడీపీ నేతల నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి పొత్తులకు తెరలేపటంతో ఆయన ముసుగు తొలిగిపోయిందని ఎద్దేవా చేశారు. అందరూ కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తే తప్ప వైసీపీపై గెలవలేమని ఒప్పుకున్నట్లయిందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలతోనే వైసీపీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ దివాళా కోరుతనం మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. ఈసారి ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా గతంలో వైసీపీ గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశామని.. అదే తమకు శ్రీరామరక్ష అని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని మహానాడులు పెట్టుకున్నా.. ప్రజలు ఎప్పటికీ వైసీపీ వెంటే ఉంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.