యాప్నగరం

జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసిన ఏపీ మంత్రి!

రిపబ్లిక్ డే వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. విశాఖ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేశారు.

Samayam Telugu 26 Jan 2020, 12:39 pm
విశాఖపట్నంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో తప్పిదం దొర్లింది. నగర వైఎస్ఆర్సీపీ ఆధ్వరంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. మంత్రి అవంతి శ్రీనివాస రావు జాతీయ జెండాను ఎగరేశారు. కానీ ఆయన పొరబాటున జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేశారు. అక్కడున్న వారెవరూ ఈ తప్పిదాన్ని వెంటనే గుర్తించకుండా జాతీయ గీతాన్ని ఆలపించడం గమనార్హం. కాసేపటి తర్వాత తప్పిదాన్ని గుర్తించిన నేతలు జెండాను కిందకు దించి.. సరిగా ఎగరేశారు. ఉద్దేశ పూర్వకంగా తలకిందుకులుగా ఎగరేస్తే.. జాతీయ జెండాన్ని అవమానించినట్టుగా భావిస్తారు.
Samayam Telugu avanti


ఈ వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. మంత్రి తీరు పట్ల మండి పడుతూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. ‘‘ఈ రివర్స్ గ్యాంగ్ భారత జాతీయ జెండాని కూడా రివర్స్ లో ఎగరేసి అవమానించిన వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని కూడా రివర్స్ లోకి తీసుకెళ్తుంది’’ అని కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు.

విశాఖ జిల్లాలోని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా.. స్తంభంపై ఉన్న చక్రం విరిగి జాతీయ జెండా కిందపడింది. అనంతరం మళ్లీ సరిచేసి జాతీయ జెండా ఎగరేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.