యాప్నగరం

‘బాబుకు వయసైపోయింది.. లోకేశ్ పనికిరాడు.. టీడీపీకి పవన్ అధ్యక్షుడైతే బెటర్’

గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తూ.. మహిళా అధికారులపైనా దాడులకు పాల్పడితే అప్పుడు పవన్‌ గాడిదలు కాశారా? అంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Samayam Telugu 4 Nov 2019, 8:48 am
ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్‌లో టీడీపీ పాల్గొంది. దీనిపై అధికార వైఎస్ఆర్‌సీపీ విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబుకు పవన్ దత్త పుత్రడని ఎద్దేవా చేస్తోంది. పవన్‌ కళ్యాణ్‌కు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నటించడం అలవాటైపోయిందని, లాంగ్‌మార్చ్‌ పేరుతో చంద్రబాబు డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్నాడని ఆరోపించింది. ఎన్నికల ముందు తెరవెనక పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే కలసిపోయాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
Samayam Telugu Avanthi


పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసింది లాంగ్‌ మార్చ్‌ కాదని, రాంగ్‌ మార్చ్‌ అని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడిగా పవన్‌‌ను పెట్టుకుంటే బాగుంటుందని మంత్రి అవంతీ ఎద్దేవా చేశారు. జనసేనకు కేడర్‌ లేదని, టీడీపీని నడిపించే నాయకుడు లేరని.. చంద్రబాబుకు వయసు అయిపోతోంది.. లోకేశ్ రాజకీయాలకు పనికిరారన్నారు. ఇలాంటి పరిస్థితిలో టీడీపీ అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ను పెట్టుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనులను జగన్ ఐదు నెలల్లో చేసి చూపించారని అన్నారు. ఎక్కడా అవినీతి జరగడం లేదని, టీడీపీ నేతలు గతంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని అవంతి ధ్వజమెత్తారు. ఈ అంశంపై అప్పట్లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.