యాప్నగరం

ఏపీ మంత్రికి కరోనా వచ్చిందని పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన బాలినేని

తనకు కరోనా వైరస్ వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Samayam Telugu 17 Apr 2020, 6:43 pm
తనకు కరోనా వైరస్ (కోవిడ్ 19) సోకిందంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒంగోలులో శుక్రవారం మంత్రి బాలినేని కరోనా నియంత్రణా చర్యలను పర్యవేక్షించారు. బాపూజీ మార్కెట్‌లో కోవిడ్- 19 డిస్ ఇన్ఫెక్షన్ టన్నల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. తనకు కరోనా వైరస్‌ సోకిందని తెలుగు దేశం, జనసేన పార్టీలు కుట్రపూరితంగా దుష్ప్రచారానికి పూనుకున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని మంత్రి బాలినేని హితవు పలికారు.
Samayam Telugu balineni


తనపై ఎవరూ ఇలాంటి ప్రచాలకు ఒడిగట్టారో తెలుసునని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంతసేపటికీ ఆరోపణలు చేయడం తప్ప, సేవా కార్యక్రమాలు చేయడం లేదని మంత్రి బాలినేని విమర్శించారు. అసలు లాక్ డౌన్‌లో టీడీపీ చేసిన సేవా కార్యక్రమాలు ఏంటో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు డప్పు కొట్టుకోవడంలో తనకు తానే పోటీ పడతారని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా స్వయంగా ఫోన్‌ చేస్తే సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాలు చేసే సమయంలో నిరాహార దీక్షలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని బాలినేని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.