యాప్నగరం

నారా లోకేష్‌కు లీగల్ నోటీసులు పంపిన మంత్రి బాలినేని

టీడీపీ నేత నారా లోకేష్ సహా పలు మీడియా సంస్థలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపారు.

Samayam Telugu 21 Aug 2020, 10:29 pm
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ పలు మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శుక్రవారం లీగల్‌ నోటీసులిచ్చారు. తమిళనాడులో మంత్రి బాలినేనికి సంబంధించిన డబ్బు దొరికిందంటూ పలు మీడియా సంస్థల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu లోకేష్ కు మంత్రి బాలినేని లీగల్ నోటీసు


దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులు నారా లోకేష్‌, బొండా ఉమామహేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభిలతో పాటు టీవీ 5, న్యూస్‌ 18 చానళ్లకు ఆయన లీగల్‌‌ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

కాగా, తమిళనాడులో గత నెలలో ఓ కారులో పోలీసులకు 5 కోట్ల రూపాయల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే పట్టుబడ్డ రూ. 5 కోట్లు తమవేనంటూ ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించారు. దీని తర్వాత కూడా ఆ డబ్బు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.