యాప్నగరం

Nara Lokesh పదవి పోతుందనే బాబు భయం: బొత్స

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. లోకేశ్ పదవి పోతుందనే బాబు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Samayam Telugu 26 Jan 2020, 2:57 pm
శాసన మండలిని కొనసాగిస్తారా? లేదంటే రద్దు చేస్తారా? అనేది సోమవారం తేలుతుందని మంత్రి బొత్స తెలిపారు. మండలి అవసరమా అని సీఎం జగన్ అసెంబ్లీలోనే అడిగారన్న బొత్స.. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ శాసన మండలి నిబంధనలను తుంగలోకి తొక్కిందని బొత్స ఆరోపించారు. మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్న మంత్రి.. శాసన మండలి లేకున్నా తమకు వచ్చే నష్టం లేదన్నారు.
Samayam Telugu botsa


ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నట్టు టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న బొత్స.. మండలి రద్దయితే లోకేశ్‌కు పదవి పోతుందని బాబుకు భయం పట్టుకుందన్నారు. లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీనే తమ ఎమ్మెల్యేలను లాగేసుకుందన్నారు.

శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలను టీడీపీకి వంతపాడే ‘ఈనాడు’ సమర్థిస్తోందా? అని రామోజీ రావును బొత్స ప్రశ్నించారు. 1983లో టీడీపీకి బలం లేనప్పుడు ఎలా వ్యవహరించారో ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీకి మెజార్టీ ఉందని రద్దుకు వ్యతిరేకిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.