యాప్నగరం

అమలాపురం విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్‌ పాత్ర: మంత్రి రాజా

Amalapuram News: అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న విధ్వంసంపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అల్లర్ల వెనక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పాత్ర ఉందని ఆరోపించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 25 May 2022, 11:37 am
Samayam Telugu దాడిశెట్టి రాజా
కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం ఆందోళనకారులు చేసిన విధ్వంసంపై లోతుగా విచారణ జరిపిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులెవరైనా సరే వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కుట్రలు పన్నడం అలవాటేనని.. పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారని ఆరోపించారు.

పచ్చని కోనసీమలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కలిసి అలజడి సృష్టించారని మంత్రి దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేయలేదా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా అని మంత్రి నిలదీశారు.

ఆనాడు తునిలో రైలు దగ్ధం చేసిన ఘటనకు చంద్రబాబే కారణమని.. ఇప్పుడు కూడా ఈ ఘటనకు కూడా ఆయనే కారణమని దాడిశెట్టి రాజా ఆరోపించారు. ప్రజలన్నా.. వ్యవస్థలన్నా చంద్రబాబుకు అసలు భయం లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారరి ఆరోపించారు. నిరసన కారులు జై జనసేన అంటూ నినాదాలు కూడా చేశారన్నారు. అమలాపురం విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల హస్తం ఉందని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.