వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషే అని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి అమర్నాథ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే, రాష్ట్ర రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
నారా లోకేష్ పాదయాత్రకు జనాలు ఎవరూ రావడం లేదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అలాంటి పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలని లోకేష్ పదే పదే అనడంలో ఉద్దేశం ఏంటని చురకలంటించారు. లోకేష్ పాదయాత్రకు ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపాలా అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ యాత్రను చూసి చంద్రబాబునాయుడు సైకోగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘స్టార్ కాంపైనర్’ లోకేషే అని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగితే వైసీపీకి అంత ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. అసలు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు.
నారా లోకేష్ పాదయాత్రకు జనాలు ఎవరూ రావడం లేదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అలాంటి పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలని లోకేష్ పదే పదే అనడంలో ఉద్దేశం ఏంటని చురకలంటించారు. లోకేష్ పాదయాత్రకు ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపాలా అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ యాత్రను చూసి చంద్రబాబునాయుడు సైకోగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘స్టార్ కాంపైనర్’ లోకేషే అని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగితే వైసీపీకి అంత ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. అసలు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు.