యాప్నగరం

సైరా అదనపు షోలు.. ఆ మంత్రి రంగంలోకి దిగాకే జగన్ ఓకే చెప్పారా?

సైరా మూవీ అదనపు షోలు వేయడం కోసం జగన్ సర్కారు అంగీకరించింది. జగన్ ఓకే చెప్పడానికి కారణం వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ మంత్రి అని ప్రచారం జరుగుతోంది. ఆయన రంగంలోకి దిగాకే జగన్ ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది.

Samayam Telugu 2 Oct 2019, 1:46 pm
సైరా నరసింహారెడ్డి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగునాట ఏ సినీ అభిమానిని కదిపినా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. టాక్ బాగుండటం, అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ సర్కారు అనుమతి ఇవ్వడంతో సైరా కలెక్షన్లు అదిరిపోనున్నాయి. దీనికి పండుగ సెలవులు కూడా తోడవడంతో తొలి వారంలోనే ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. సైరా మూవీకి స్పెషల్ షోలు వేసుకోవడానికి ఏపీ సర్కారు అనుమతి ఇవ్వదని అంతా భావించారు. కానీ కొద్ది గంటల ముందు అనూహ్యంగా సర్కారు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.
Samayam Telugu syera jagan


భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కించిన ‘సైరా’ సినిమాకు అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం కోసం మెగా ఫ్యామిలీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. సైరా ప్రి రిలీజ్ ఈవెంట్ రైట్స్ సాక్షి ఛానల్‌కు ఇచ్చారు. సాక్షికి ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు ఇచ్చారు. అన్ని మార్గాల ద్వారా సీఎం జగన్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ‘సైరా’ అదనపు షోలకు అనుమతి ఇవ్వడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదట.

దీంతో గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది.. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తోన్న కన్నబాబు రంగంలోకి దిగారట. జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించి.. ప్రజారాజ్యంతో పొలిటీషియన్‌గా మారిన ఆయన.. ‘సైరా’ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేలా జగన్‌ను ఒప్పించారట. దీంతో కొద్ది గంటల ముందు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఎవరు ఒప్పించారనేది పక్కనబెడితే.. అదనపు షోలకు పర్మిషన్ రావడంతో అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.