యాప్నగరం

అలా చేయడానికి చంద్రబాబు పిచ్చోడు కాదు.. మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు

పీఎస్ దగ్గర రూ. 2 వేల కోట్లు పెట్టడానికి చంద్రబాబునాయుడు పిచ్చోడు కాదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కచ్చితంగా శిక్ష పడుతుందని తెలిపారు.

Samayam Telugu 18 Feb 2020, 7:08 pm
ఐటీ దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయని చెప్పారంటే.. డబ్బు రూపంలో ఇంట్లో దొరికినట్లు కాదని వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయని అర్థమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. రూ. 2 వేల కోట్లు వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) ఇంట్లో పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేమీ పిచ్చోడు కాదన్నారు. ఆయన చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఎస్ శ్రీనివాస్‌ తన డైరీలో రాసుకున్నారన్నారు.
Samayam Telugu babu, nani


Also Read: అమరావతిలో భూములు కొన్న అనంతపురం పేదలు! ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దూకుడు

చంద్రబాబు రూ. వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రూ. 2 వేల కోట్ల నగదు దొరికిందని ఎవరూ చెప్పలేదని, ఆ మేరకు అక్రమాలు జరిగినట్లు ఐటీ శాఖ ప్రకటించిందన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.

Also Read: రాజధాని తరలింపు: హైకోర్టుకు కీలక విషయం చెప్పిన వైసీపీ సర్కార్

అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ సంబంధాలు ఉంటాయని.. తమకు మండలి వద్దని కేంద్రానికి స్పష్టం చేసినట్లు మంత్రి నాని చెప్పారు. దీనిపై రెండు, మూడు నెలల లోపు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసన మండలి అభివృద్ధి అడ్డుపడుతుందని.. రాజకీయాలకు వేదికగా మారుతోందని విమర్శించారు. అందుకే మండలిని రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.

Also Read: జగన్ సర్కారుకు షాక్.. హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.