యాప్నగరం

నువ్వు హిందువా.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 22 Sep 2020, 5:54 pm
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనపై తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. విజయవాడలో మంగళవారం మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బూట్లు వేసుకుని తిరుమల కొండ ఎక్కితే.. సీఎం జగన్‌ చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారని తెలిపారు.
Samayam Telugu చంద్రబాబు, కొడాలి నాని


‘‘తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా? ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా? చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?’’ అంటూ మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ దేవుళ్లను కించపరచలేదని, ఆంజనేయ స్వామిపై ఒకటి మాట్లాడితే.. టీడీపీ మరొకటి దుష్ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

‘‘సీఎం జగన్‌ తిరుపతికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన చాలా సార్లు తిరుమల వెళ్లారు. భవిష్యత్‌లో కూడా వెళతారు. టీడీపీ, బీజేపీ పార్టీలు ‘హిందూ’ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌కు అన్ని మతాలు, కులాలు ఒక్కటే. నా మెడలో అన్ని మతాల దండలు వేసుకుంటాను. నాకు అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను’’ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.