యాప్నగరం

YS Jagan సంచలనం: ఏపీలో వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి!

Kurasala Kannababu: ఏపీలో వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే నిర్వహించబోతున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

Samayam Telugu 5 Nov 2020, 8:24 pm
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్లీ భూ సర్వేను చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ప్రక్రియ కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu జగనన్న భూ సర్వే


ఇక సమగ్ర భూసర్వే కోసం రూ. 1,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. 2021 జనవరి నుంచి 2023 జూన్ నాటికి దశల వారీగా రీ సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీనికి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ’ పేరు నిర్ణయించినట్లు మంత్రి కన్నబాబు ప్రకటించారు.

అలాగే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామని.. సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.