యాప్నగరం

కలకలం రేపుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి లేఖ.. మంత్రి చెప్పినా లెక్కలేదా!

నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది.

Samayam Telugu 27 Sep 2020, 8:51 pm
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాసిన లేఖ తన సొంత జిల్లా నెల్లూరులో కలకలం రేపుతోంది. మంత్రి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యం దారుణంగా ఉండటంతో ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా స్పందన లేదు. మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి ఫోన్ చేసినా ఎవరూ పట్టించులేదని సమాచారం. దీంతో మంత్రి గౌతమ్ రెడ్డి స్వయంగా కలవమని చెప్పినా హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ లెక్కచేయలేదని వార్తలు గుప్పుమన్నాయి.
Samayam Telugu మేకపాటి గౌతమ్ రెడ్డి


ఈ క్రమంలో సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు స్వయంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లేఖ రాశారు. దీంతో ఆ అధికారిపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మంత్రి చెబితేనే అధికారులు లెక్కచేయట్లేదంటే, సామాన్యుల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

కాగా, ఇటీవలే మున్సిపల్ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివ్యూ కూడా చేశారు. ఈ సమావేశంలో ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ మంత్రి కూడా ప్రకటించారు. మంత్రి అనిల్ అలా ప్రకటన చేసి వారం తిరగక ముందే పారిశుద్ధ్యంపై మంత్రి మేకపాటి చెప్పినా పట్టించుకోకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.