యాప్నగరం

అంతా వరదల వల్లే.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

నదుల్లో వరదల కారణంగా ఇసుక లభ్యత తగ్గింది. అందుకే ఇసుక సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇసుక కొరతను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Samayam Telugu 12 Oct 2019, 5:13 pm
రాష్ట్రంలో ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డులపై రివ్యూ చేశారు. ఇసుక కొరత, సరఫరా సమస్యలపై అధికారులతో చర్చించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇసుక ఇబ్బందులను త్వరలోనే అధిగమిస్తామన్నారు.
Samayam Telugu sand11564497443


ప్రస్తుతం రోజుకు 35 వేల టన్నుల ఇసుక సరఫరా అవుతోందని పెద్దిరెడ్డి తెలిపారు. దానిని లక్ష టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. ప్రైవేటు భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తామన్నారు. వరదలు తగ్గే వరకు రైతుల అనుమతితో పట్టా భూముల్లో తవ్వకాలు చేపడతామన్నారు. ఇసుక రీచ్‌లు, స్టాకు యార్డుల సంఖ్య పెంచుతామన్నారు.

Also Read: పల్నాడు ప్రశాంతం.. అవి రాజకీయ హత్యలు కాదు.. ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్

ఇప్పటికే ఏపీలో ఇసుక కొరత తీవ్ర సమస్యగా మారింది. గతంలో కేవలం రూ.2 వేలకు లభించే ట్రక్కు ఇసుక ప్రస్తుతం రెండు మూడు రెట్లు పెరిగిపోయింది. గృహనిర్మాణ దారులు ఇసుక కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలుచోట్ల భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, రాడ్ బెండింగ్, వడ్రంగులు, ప్లంబర్లు తదితర అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

జగన్ సర్కార్ అసమర్థతతోనే ఇసుక కొరత ఏర్పడిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ విధానాల కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులు ఉండే పరిస్థితులు వచ్చాయని, అనుబంధ రంగాల కార్మికులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఇసుక కొరతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.