యాప్నగరం

పవన్ కళ్యాణ్‌ జోకర్‌, నాగబాబు మనిషిగా ఎదిగారు గానీ.. మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తాను రాణినే అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 Jan 2023, 8:07 pm
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా సెల్వమణి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రినయ్యానని.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ని చూసి ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu మంత్రి రోజా (ఫైల్ ఫొటో)


పవన్ కళ్యాణ్ తనను డైమండ్ రాణి అంటున్నారని.. తాను నిజంగానే రాణినే అని మంత్రి రోజా పేర్కొన్నారు. సినిమాల్లో నటిగా, ఇంట్లో ఇల్లాలిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనని తాను నిరూపించుకొని రాణిలా ఉన్నానని చెప్పారు. తన గురించి పవన్ కళ్యాణ్ మరోసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బాగుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇక, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైకోకు పరాకాష్టగా మారారని, జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పవన్‌లకు పదువులే ముఖ్యమని.. ప్రజల సమస్యల్ని పట్టించుకోరని మండిపడ్డారు. ఇక తనకు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి రాజకీయాలకు పనికి రారని ఆనాడే చెప్పానని.. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానని వ్యాఖ్యానించారు. చిరంజీవి సున్నితమైన వ్యక్తి అని.. ఆ విషయమే ఇప్పుడు నిజమని తేలిందన్నారు.

అయితే, చిరంజీవి తమ్ముళ్లు పవన్‌ కళ్యాణ్, నాగబాబు మాత్రం మహిళలపై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి రోజా ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్‌ను జోకర్‌గా అభివర్ణించిన రోజా.. నాగబాబుపై కూడా పంచ్‌లు వేశారు. నాగబాబు మనిషిగా ఎదిగారు గానీ, మైండ్ పెరగలేదని ఎద్దేవా చేశారు. పవన్‌కి, నాగబాబుకి మేల్ ఈగో ఎక్కువగా ఉందన్నారు. ఆ ఇద్దరికి రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప ఇంకేం తెలియదని సెటైర్లు వేశారు. కనీసం ఒక్క చోట కూడా గెలవని ఆ ఇద్దరు తనపై వ్యాఖ్యలు చేయడం చిల్లరగా ఉందన్నారు. తాను కళాకారులతో డ్యాన్స్ చేస్తే, వారు ట్రోల్ చేస్తున్నారని.. వారు మాత్రం కూతురు వయస్సున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.