యాప్నగరం

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. ఆల్రెడీ ప్రచారం ప్రారంభించాం: మంత్రి సీదిరి అప్పలరాజు

Sidiri Appalaraju: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, సంసిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సూచించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో మంత్రి అప్పలరాజు నూతన క్యాంపు కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌‌సీపీదే విజయం అని దీమా వ్యక్తం చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 Nov 2022, 8:31 pm
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల గురించి మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, సంసిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సూచించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో మంగళవారం (నవంబర్ 29) మధ్యాహ్నం మంత్రి అప్పలరాజు నూతన క్యాంపు కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు ఏపీ ఎన్నికలపై ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu sidiri appalaraju
సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి సీదిరి అప్పలరాజు (ఫైల్ ఫొటో)


ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తమ ప్రభుత్వంపై జనంలో పిసరంత కూడా వ్యతిరేకత లేదని చెప్పారు.

పడిలేస్తున్న కెరటమే నాకు ఆదర్శం
‘మీ అందరి కోసం చాలా అండగా నిలబడతా. ఎలాంటి సమస్య ఉన్నా, ఏ రాత్రి అయినా నా తలుపు తట్టవచ్చు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీ సోదరుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎలాంటి తప్పు చేయడు’ అని మంత్రి సీదిరి అన్నారు.


చిన్నతనం నుంచి తాను సముద్రం తీరంలో పెరిగానని.. సముద్రమే తనకు ఆదర్శమని డాక్టర్ అప్పలరాజు చెప్పారు. ‘పడి లేస్తున్న కెరటాలే నాకు ఆదర్శం. మీ తోడు ఉన్నంతవరకూ డాక్టర్ అప్పలరాజును ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ జీవితం మీది’ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా తనను ఏమీ చేయలేవని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

దళితుడికి మర్యాద ఇదే, కాళ్లు మొక్కిన దొర బిడ్డ.. ఎమ్మెల్యే రాజయ్య కన్నీటిపర్యంతం
London: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుమార్తె కూచిపూడి నృత్యం
Read Latest AP News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.