యాప్నగరం

చంద్రబాబుకు గుమస్తాగా పవన్ కళ్యాణ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మరోసారి ఫైరయ్యారు. చంద్రబాబు దగ్గర పవన్ గుమస్తాగా పనిచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 8 Feb 2020, 7:41 pm
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లాలూచీ పడి బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విజయవాడ 44వ డివిజన్‌లో శనివారం మంత్రి వెలంపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి 60 లక్షల వ్యయంతో వేయనున్న రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు దగ్గర పవన్‌ గుమస్తాగా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నోట ఒకే మాట వస్తుందని చెప్పారు.
Samayam Telugu pawan 9

పవన్ అజ్ఞానానికి నిదర్శనం
గత ఎన్నికలకు ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వెలంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలన్న నియమం ఉందని గుర్తు చేశారు.

Also Read: ఆ అమ్మాయి కోసం పవన్ కళ్యాణ్ పోరుబాట.. 12న భారీ ర్యాలీ

దుర్మార్గంగా దోచుకున్నారు
సీఎం జగన్‌ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందాలనే లక్ష్యంతో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యవస్థల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరవేస్తమన్నారు. గతంలో పెన్షన్లు 44 లక్షలు ఉంటే ఇప్పుడు సంఖ్య 54 లక్షలకు చేరుకున్నాయని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

Also Read: నీ తలపై జుట్టు లేదు.. ఎంపీ గల్లాపై మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.