యాప్నగరం

బెజవాడ గ్యాంగ్ వార్‌పై మంత్రి సీరియస్, సీపీకి ఫోన్.. టీడీపీపై సంచలన వ్యాఖ్యలు

బెజవాడ గ్యాంగ్ వార్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 31 May 2020, 11:11 pm
విజయవాడ నగరంలో రెండు గ్రూపుల మధ్య చోటుచేసుకున్న వివాదంపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. బెజవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న శ్రీనివాస్ నగర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో విజయవాడలో రౌడీ పాలన సాగిందని మంత్రి ఆరోపించారు. ఇకపై నగరంలో వారి ఆటలు సాగబోవని స్పష్టం చేశారు.
Samayam Telugu బెజవాడ గ్యాంగ్ వార్‌పై మంత్రి వెల్లంపల్లి సీరియస్


Must Read: విజయవాడలో గ్యాంగ్ వార్.. కత్తులతో రెచ్చిపోయిన విద్యార్థులు..!

పటమటలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్‌ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, విజయవాడలో చోటుచేసుకున్న గ్యాంగ్ వార్‌పై నగర డీసీపీ హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. పెనమలూరులోని ఓ అపార్టుమెంట్ విషయంలో సందీప్, మణికంఠ మధ్య తలెత్తిన విభేదాలే ఘర్షణకు కారణమని తెలిపారు.

Must Read: బెజవాడ గ్యాంగ్‌ వార్‌: గ్రూప్ లీడర్ మృతి.. ఒళ్లు గగుడ్పొడే విషయాలు..
విభేదాలు కాస్తా ఆధిపత్య పోరుగా మారిందని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒకరి ఇంటికి వెళ్లి మరొకరు గొడవలు పడ్డారన్నారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు ఫోన్ చేసుకుని సవాల్ విసురుకున్నారని తెలిపారు. ఈ తరుణంలో సందీప్, పండు రెండు వర్గాలకు చెందిన దాదాపు 30 మంది ఒకరిపై మరొకరు దాడులకు తెగబడినట్లు తెలిపారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పలువురు గాయపడా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, మరణించిన సందీప్ టీడీపీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. సందీప్ ప్రత్యర్థి మణికంఠ అలియాస్ పండు జనసేనకు చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది.

Must Read: బెజవాడ గ్యాంగ్ వార్‌లో ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.