యాప్నగరం

వీడియో: మొహర్రం వేడుకల్లో అపశ్రుతి.. పిట్టగోడ కూలడంతో..

కర్నూలు జిల్లాలో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పిట్టగోడ కూలడంతో 20 మంది గాయపడ్డారు. దీంతో వారిని కర్నూలు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 10 Sep 2019, 12:53 pm
కర్నూలు జిల్లాలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బి.తాండ్రపాడులో పీర్ల చావిడి దగ్గర పిట్ట గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 20 మందికి పైగా గాయడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పీర్ల చావిడి వద్ద నిప్పుల గుండాన్ని తొక్కుతున్న దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. వీరిలో కొందరు పక్కనే ఉన్న ఇంటి మేడపై ఉన్న పిట్టగోడ మీదకు ఎక్కారు. బరువు ఎక్కువ కావడంతో పిట్టగోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు.
Samayam Telugu peerla panduga


పిట్టగోడతోపాటు మనుషులు కూడా కిందనున్న వారి మీద పడటంతో.. వారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బాధితులను పరామర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.