యాప్నగరం

అవినీతి ఉద్యోగులను పట్టుకున్న ఎమ్మెల్యే రజినీ.. వీడియో వైరల్

చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఉద్యోగుల ఆటకట్టించారు.. ఎమ్మెల్యే విడదల రజిని. అవినీతికి పాల్పడ్డ ఉద్యోగిని వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.

Samayam Telugu 26 Jan 2020, 4:01 pm
మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రూ. 1,000 లంచం తీసుకున్న ఉద్యోగిని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వీడియోను ట్వీట్ చేశారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అక్కడి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వస్తే అతడి నుంచి రూ. 1,000 లంచం తీసుకున్నారని తెలిపారు. తన పీఏ దగ్గరే ఇలా వ్యవహరిస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
Samayam Telugu mla rajini


లంచం తీసుకున్న సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారిని ఆదేశించారు. అదే కార్యాలంలో ఇంకా ముగ్గురు అవినీతి అధికారులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిపైనా నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తన మనుషులు ఇకపై సామాన్య ప్రజల మాదిరిగానే కార్యాలయానికి వస్తుంటారని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. లంచం తీసుకున్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆ వీడియోకు ఎమ్మెల్యే తన సందేశాన్ని సైతం జోడించారు. ఇది రాజన్న రాజ్యమని, జగనన్న పరిపాలనలో ఎక్కడా అవినీతి జరగటానికి వీల్లేదన్నారు. అవినీతికి పాల్పడే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ ట్వీట్‌కు అవినీతి రహిత ఏపీ హ్యాష్ ట్యాగ్ జోడించారు. అలాగే ఈ ట్వీట్‌ను సీఎం జగన్, హోం మంత్రి సుచరితకు జోడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.