యాప్నగరం

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్

TS Rtc Strike| తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించిన ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా. తెలంగాణలో ఉద్యమం చేస్తున్నా అక్కడి ముఖ్యమంత్రి కార్మికుల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. జగనన్నమాత్రం అలా కాదన్న రోజా.

Samayam Telugu 10 Oct 2019, 1:08 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా. ఆర్టీసీ సమ్మెపై స్పందించిన ఆమె.. కేసీఆర్ అక్కడ నిర్దాక్షణ్యంగా ఉద్యోగాల్లో నుంచి తీసేశారన్నారు. ఏపీలో మాత్రం ఆర్టీసీ కార్మికులు అదృష్టవంతులని.. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం అయ్యారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణలో సమ్మెతో పాటూ తాజా పరిణామాలపై స్పందించారు.
Samayam Telugu roja


Also Read: 'వైసీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తుంటే.. జనాలు భరించాలా'

ఏపీలో ఎలాంటి ఉద్యమం లేకపోయినా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యమంత్రి జగన్ గుర్తించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని నిలబెట్టుకున్నారన్నారు. న్యాయమైన కోరికగా భావించి.. మాటను నిలబెట్టుకొని.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు.

Read Also: కాకాణి వర్సెస్ కోటంరెడ్డి.. అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేల పంచాయితీ

తెలంగాణలో ఉద్యమం చేస్తున్నా అక్కడి ముఖ్యమంత్రి కార్మికుల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు అన్నారు రోజా. వైఎస్సార్, వైఎస్ జగన్ వల్లే ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్టీసీ కార్మికులు అండగా నిలబడాలని కోరారు. ఎమ్మెల్యే రోజా కేసీఆర్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.