యాప్నగరం

MLA Roja: మూడు రాజధానుల బిల్లు పాసైపోయింది.. రోజా సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానుల బిల్లు పాసైపోయిందంటున్న ఎమ్మెల్యే రోజా. 14 రోజుల నిబంధనతోనే ఆమోదం పొందినట్లే అంటూ రోజా వ్యాఖ్యలు. మంగళవారం ఇదే విషయాన్ని ప్రస్తావించిన మంత్రి సుభాష్ చంద్రబోస్.

Samayam Telugu 12 Feb 2020, 2:40 pm
మూడు రాజధానుల బిల్లుపై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లు పాసైపోయిందని పెద్ద బాంబే పేల్చారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందినట్లే అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన రోజా తాజా పరిణామాలపై స్పందించారు.
Samayam Telugu roja


Read Also: 'జగన్ ఫ్లెక్సీని చించేసిన వైసీపీ కార్యకర్త.. ఓటేసి తప్పు చేశానంటూ'

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుచేటన్నారు రోజా. మూడు రాజధానులను వ్యతిరేకించిన బాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలన్నారు. చంద్రబాబు తాపత్రయం మొత్తం రియల్ ఎస్టేట్‌పై ఉంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమన్నారు.

ప్రజలు చైతన్యవంతులు కాబట్టి చంద్రబాబు కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారన్నారు ఏపీఐఐసీ ఛైర్మన్. లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న సోషల్‌ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తే 80 శాతం టీడీపీ నేతలు జైల్లో ఉంటారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ పద్దతి మార్చుకోవాలన్నారు రోజా.

మూడు రాజధానుల బిల్లుపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ఫైల్‌ వెనక్కు వచ్చింది. ఫైల్‌ను శాసనమండలి కార్యాలయం తిప్పిం పంపింది. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని తేల్చారట. తాజా పరిణామాలపై శాసనమండలి కార్యదర్శిని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కలిశారు. మండలి ఛైర్మన్ రూల్‌ 154 కింద కమిటీ వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.