యాప్నగరం

అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్‌కే ఆ క్రెడిట్.. ఏపీ సీఎంపై రోజా ప్రశంసలు

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆలోచన చేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు జగన్ మరో అడుగు ముందుకు వేసి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారు.

Samayam Telugu 10 Oct 2019, 5:45 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటే.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ మరో అడుగు ముందుకు వేసి వైఎస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ప్రారంభిచారన్నారు. నగరిలోని జూనియర్ కాలేజీలో వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించిన రోజా.. ఇది అద్భుత పథకం అంటూ కితాబిచ్చారు.
Samayam Telugu mla roja.


Read Also: కంటి వెలుగు ప్రారంభం.. జగన్‌‌ సర్కార్‌కు కొత్త తలనొప్పి

సీఎం వైఎస్‌ జగన్‌ మానవత్వం ఉన్న నాయకుడన్నారు రోజా. ప్రభుత్వం పేద ప్రజల కోసం వైఎస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని.. ఇది పేద ప్రజలకు మరో సంజీవని వంటిది అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ కంటి సంబంధిత సమస్యలు రాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ కంటి వెలుగును రాష్ట్రవ్యాప్తంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభమయ్యింది. మొత్తం ఆరు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.