యాప్నగరం

ఆ సైగ అప్పుడే చేసుంటే.. బాలయ్యపై రోజా సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలయ్యపై విరుచుకుపడిన ఎమ్మెల్యే రోజా. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలయ్య సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదన్న ఎమ్మెల్యే. బాలయ్యను సీమ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే ఉందన్న రోజా.

Samayam Telugu 4 Feb 2020, 11:43 am
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలయ్య సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది అన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలయ్యను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బాబుతో పాటూ బాలయ్య, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు.
Samayam Telugu roja


పెద్దల సభ (శాసనమండలి)కు పెద్దల్ని తీసుకురాకుండా దద్దమ్మను తీసుకొచ్చారని లోకేష్‌ గురించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేదు.. లోకేష్ భవిష్యత్ రాజకీయ సమాధి అవుతుందన్నారు. అందుకే శాసనమండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారు.. వారు లేకున్నా ఒకటే అన్నారు.

పవన్ కళ్యాణ్‌కు జీవోల గురించి తెలియదన్నారు రోజా. చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులకు అనుగుణంగానే జగన్ అడుగులు వేస్తున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.