యాప్నగరం

వైసీపీ న్యూ స్ట్రాటజీ... మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు?

శాసన మండలి ఛైర్మన్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన షరీఫ్ స్థానంలో కొత్త చైర్మన్‌గా నూతన ఎమ్మెల్సీ మోసేను రాజు పేరు పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 16 Jun 2021, 9:38 am

ప్రధానాంశాలు:

  • ఏపీ మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు?
  • వైకాపా వర్గాల్లో చర్చ
  • షరీఫ్ స్థానంలో నూతన ఛైర్మన్‌గా ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
శాసన మండలి నూతన ఛైర్మన్‌గా మోసేను రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీగా మోసేను రాజు నియామకానికి సోమవారం గవర్నర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల్లో ఒకటి ఎస్సీకి, రెండోది బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనపై వైసీపీ అధిష్ఠానం చర్చిస్తోంది. ఎంఏ షరీఫ్‌ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో మైనారిటీ నుంచే కొత్తవారు వస్తారన్న ప్రచారం జరిగింది.
అయితే అసెంబ్లీ స్పీకర్ పదవిని బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కి ఇచ్చినందువల్ల మండలి ఛైర్మన్‌ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మోసేను రాజు పేరు పరిశీలనకు వచ్చిందని అధికార పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇలా చేస్తే డిప్యూటీ ఛైర్మన్‌ పదవి బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.