యాప్నగరం

‘పులివెందుల పులి.. పిల్లి అయిందా..?’

ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టు చేస్తారా అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పులివెందుల పులి అంటూ డప్పు కొట్టించుకున్నారని, ఇప్పుడు పులి, పిల్లి అయిందా? అని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 16 Feb 2020, 8:40 pm
బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన రూ. 6,500 కోట్లు ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ ఓ వీడియోను షేర్ చేసిన యువకుడిని అరెస్టు చేయడం దారుణమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘కేంద్రం మెడలు వంచేస్తా’ అన్న వస్తాదు సోషల్ మీడియా పోస్టులకు భయపడటం ఏంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల పులి అంటూ డప్పు కొట్టించుకున్నారని, ఇప్పుడు పులి, పిల్లి అయిందా? అని వ్యాఖ్యానించారు.
Samayam Telugu jagan 8


Also Read: ఏపీలో రెండు కులాల మధ్య గొడవలు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన రూ. 6,500 కోట్లు పక్కదారి పట్టించిందని లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఓ యువకుడు వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచాడన్నారు. అయితే ఆ వీడియోను పోస్ట్ చేసి, బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని పోస్ట్ పెట్టినందుకు పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్‌కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. చివరకు ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెడతారా? అంత పెద్ద తప్పు ఏం చేశాడని నిలదీశారు.

Also Read: జగనోరిని అబద్ధాలు.. బాబోరి కథలు.. శ్రీకాకుళం యాసలో ఎంపీ, ఎమ్మెల్యే అదిరిపోయే పంచ్‌లు

అధికారుల అత్యుత్సాహం తగదు..
సీఎం జగన్ దగ్గర మార్కులు సాధించడం కోసం అధికారుల అత్యుత్సాహం తగదని నారా లోకేశ్ హితవు పలికారు. కోర్టులు చివాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. విజయ్ కుమార్ రెడ్డికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఫైనల్‌గా విజయ్ పులివెందుల పులి అని, సీఎం జగన్ పులివెందుల పిల్లి అని వ్యాఖ్యానించారు.

Also Read:
‘త్వరలో ఇంటర్‌పోల్‌ అదుపులోకి సీఎం జగన్‌’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.