యాప్నగరం

ప్రజలు ఛీకొట్టినా బాబులో మార్పు రాలేదు.. టీడీపీ ఎమ్మెల్సీ

ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబు తీరులో మార్పు, బుద్ధి రాలేదు అన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ షరీఫ్‌కు సైగలు చేస్తూ సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. శాసనమండలినలి కూడా టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని మండిపడ్డారు. చంద్రబాబుకు మండలి గ్యాలరీలోకి ఎందుకు వచ్చారని.. రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

Samayam Telugu 25 Jan 2020, 7:50 am
ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబు తీరులో మార్పు, బుద్ధి రాలేదు అన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ షరీఫ్‌కు సైగలు చేస్తూ సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. శాసనమండలినలి కూడా టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని మండిపడ్డారు. చంద్రబాబుకు మండలి గ్యాలరీలోకి ఎందుకు వచ్చారని.. రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
Samayam Telugu mlc pothula suneetha slams chandrababu on ap legislative council consequences
ప్రజలు ఛీకొట్టినా బాబులో మార్పు రాలేదు.. టీడీపీ ఎమ్మెల్సీ


చంద్రబాబు వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు

శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు చట్టసభల ప్రతిష్టను దిగజార్చారని సునీత విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని.. ఇప్పటికైనా టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సూచించారు.. హుందాగా వ్యవహరింంచాలన్నారు. ఇప్పటికూనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని.. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం రాజకీయాలు పక్కనపెట్టి పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇవ్వాలన్నారు.

ప్రలోభాలకు గురికావాల్సిన అవసరం లేదు

ఇక శాసనమండలిలో ఛైర్మన్ నిబంధనలు పాటించకుండా.. వికేంద్రీకరణ బిల్లుపై తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఓ మచ్చగా అభివర్ణించారు. మండలి చైర్మన్‌ పూర్తిగా తప్పు చేశారని, ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులను అందరు స్వాగతించాలని.. రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు. తమది ప్రజల కోసం పనిచేసే కుటుంబమని.. ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తనకు లేదని సునీత అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తాను మద్దతిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సునీత, సురేష్

ఎమ్మెల్సీ పోతుల సునీత తన భర్త సురేష్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు మద్దతు ఇస్తానని.. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.

వైసీపీకి అనుకూలంగా సునీత ఓటు

శాసనమండలిలో రూల్‌ 71పై ఓటింగ్‌లో టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే రూల్‌ 71ను టీడీపీ పెట్టిందని.. అందుకే వ్యతిరేకంగా ఓటు వేశానని సునీత చెబుతున్నారు. ఆమె విప్‌ను ధిక్కరించడంతో టీడీపీ వర్గాలు షాకయ్యాయి. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. ఉన్నట్టుండి అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం హాట్‌టాపిక్ అయ్యింది. అలాగే మండలి ఛైర్మన్‌కు ఆమెపై టీడీపీ ఫిర్యాదు చేసింది.

పరిటాల రవికి సన్నిహితులు సురేష్, సునీత

పోతుల సునీత పరిటాల రవి అనుచరుడైన పోతుల సురేష్‌ సతీమణి. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె ఓడిపోయారు. ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరడంతో.. చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగానూ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆమె కూడా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.