యాప్నగరం

చురుగ్గా రుతుపవనాలు.. వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనా వేసిన సమయం కంటే ముందే వచ్చినా జూన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. అయితే జులైలో సాధారణ వర్షపాతం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.

Samayam Telugu 4 Jul 2021, 8:22 am
కొద్ది రోజులు మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న నైరుతి గాలుల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారినట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శనివారం కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వివరించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
The IMD forecast said, “The sky condition is likely to be partly cloudy. Thunderstorms with light to moderate rain are likely to occur in some areas.” (File photo)


రాగల నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. పశ్చిమ దిశ నుంచి వీచిన గాలులతో రుతుపవనాలు చురుకుగా మారియన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే రెండు మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం కూడా అల్లకల్లోంగా మారింది.

ఇక, జులైలో నైరుతి రుతుపవనాల వల్ల 94 నుంచి 106 శాతం వరకు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రం వద్ద తటస్థంగా ఉన్న ఎల్-నినో‌ను సూచిస్తుందని పేర్కొంది. పలు ప్రపంచ నమూనాల ఆధారంగా తాజా అంచనాలను రూపొందించినట్టు ఐఎండీ పేర్కొంది. రుతుపవనాల మిగిలిన భాగంలో తటస్థ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.