యాప్నగరం

Andhra ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త.. మార్చి వరకు ఉచితంగా..!

ఏపీలోని పేద ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. మార్చి వరకు ఉచితంగా రేషన్ పంపిణీ!

Samayam Telugu 11 Jan 2022, 6:03 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఏపీలోని లబ్దిదారులందరికీ ఈ ఏడాది మార్చి నెల వరకు ఒక్కొక్కరికి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబర్ నుంచి లబ్ధిదారులకు ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాల శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ఏపీకి ప్రధాని మోదీ గుడ్ న్యూస్


దీంతో జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం వెల్లడించారు. దీంతో పేద ప్రజలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

కాగా, కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న క్రమంలో 2021లో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా వల్ల పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొటున్న పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు మోదీ సర్కారు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేశారు. అప్పటి నుంచి పేద ప్రజలకు ప్రతి నెలా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో ఈ పథకాన్ని మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మార్చి వరకు ప్రతి నెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.