ఏపీ ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖకు తాజాగా మరో సలహాదారుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఫ్తీ సయ్యద్ మొహమ్మద్ అలీ బాగ్దాదిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం.. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ శాఖలో రెగ్యులర్ అధికారులను నియమించని ప్రభుత్వం.. నలుగురు సలహాదారులను నియమించిందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఈ నెల 18న కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోని క్రైస్తవ వ్యవహారాలకు సంబంధించి మద్దు బాలస్వామిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. వారం కూడా కాకుండనే మరో సలహాదారుడ్ని ప్రభుత్వం నియమించింది. వీరిద్దరే కాకుండా ఇంతకు ముందు నుంచే జియావుద్దీన్, హబీవుల్లాలు సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఈ నియామకంతో మైనార్టీ వ్యవహారాలకు సలహాదారుల సంఖ్య నాలుగుకు చేరింది.
అంతేకాదు మైనారిటీ సంక్షేమశాఖకు సలహాదారులుగా కొనసాగుతున్నవారికి కూడా మంచి జీతభత్యాలు ఉన్నాయి. జియావుద్దీన్, హబీవుల్లాలకు కేబినెట్ హోదాతో పాటుగా నెలకు రూ.3.50 లక్షలు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రైస్తవ వ్యవహారాల సలహాదారుగా నియమించిన బాలస్వామి.. ఇప్పుడు నియమించిన మహమ్మద్ అలీ బాగ్దాదీలకు జీతభత్యాలకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.. కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో మరో ఇద్దరిని పదవుల్లో నియమించడం ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు మైనారిటీ సంక్షేమశాఖకు సలహాదారులుగా కొనసాగుతున్నవారికి కూడా మంచి జీతభత్యాలు ఉన్నాయి. జియావుద్దీన్, హబీవుల్లాలకు కేబినెట్ హోదాతో పాటుగా నెలకు రూ.3.50 లక్షలు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రైస్తవ వ్యవహారాల సలహాదారుగా నియమించిన బాలస్వామి.. ఇప్పుడు నియమించిన మహమ్మద్ అలీ బాగ్దాదీలకు జీతభత్యాలకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.. కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో మరో ఇద్దరిని పదవుల్లో నియమించడం ఆసక్తికరంగా మారింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News